మారు వేషంలో దుగ్గిరాల ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళిన కనకం!
on Mar 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ల-49 లో.. రాజ్ వాళ్ళ నానమ్మ వచ్చి కావ్యతో మాట్లాడుతుంది. "ఈ ఇంట్లో సగం మంది నిన్ను సమర్థించే వాళ్ళే ఉన్నారు. నేను, తాతయ్య మేమిద్దరం నీకు అండగానే ఉంటాం. రిసెప్షన్ పెట్టి అందరికి పరిచయం చేయాలనుకుంటున్నాడు మీ తాతయ్య. ఈ ఇంటి ఆచారం ప్రకారం కొత్త కోడలికి భర్త మొదటి ముద్ద తినిపించాలి. నీకు రాజ్ తినిపించాడు. అలాగే ఈ ఇంట్లో నువ్వు వేసుకునే మొదటి బట్టలతో వాడు నగలు ఇవ్వాలి. అనుకోకుండా రాజ్ నీ మెడలో ఈ గొలుసు వేసాడు. దైవలిఖితం.. దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. ఎక్కడో ఉన్న మిమ్మల్ని దేవుడు కలిపాడు. మీ మధ్య ఏర్పడ్డ అడ్డుగోడలు తొలగిస్తాడు" అని కావ్యతో రాజ్ నానమ్మ అంటుంది.
రాహుల్ మరియు వాళ్ళ చెల్లెలు రేఖ ఇద్దరు మాట్లాడుకుంటారు. స్వప్నకి ఎవడో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లున్నాడు. అందుకే వెళ్ళిపోయిందని, స్వప్నది మంచి క్యారెక్టర్ అని అనుకోకు.. మన మమ్మీ చెంప మీద కొడుతుందా ఆ అపర్ణ అని రాహుల్ తో రేఖ అంటుంది. మన ముగ్గురికి ఆ రెండు ఫ్యామీలీలు శత్రువులే.. ఎక్కడ వీలైతే అక్కడ మనం పగ తీర్చుకోవాలని ఇద్దరూ అనుకుంటారు.
నేను నీ పెళ్ళిలో లేనని కోపంగా ఉందా.. చాలా అన్యాయం జరిగింది రాజ్. అసలు ఏ అమ్మాయిని అయితే చూడకూడదని అనుకున్నావో ఆ అమ్మాయినే జీవితాంతం చూస్తూ ఉండాలని రాజ్ తో రాహుల్ అంటాడు. నువ్వు అంత బాధపడకు రాహుల్ అని రాజ్ అంటాడు. రాహుల్ తన రివర్స్ డ్రామాతో రాజ్ ని కన్విన్స్ చేస్తాడు.
మరోవైపు కనకం వాళ్ళ ఇంట్లో నుండి హడావిడిగా రెడీ అయి బయల్దేరుతుండగా కనకం భర్త, అప్పు అందరూ చూస్తారు. ఎక్కడికెళ్తున్నావని కనకంని భర్త ప్రశ్నిస్తాడు. "కావ్యని దుగ్గిరాల ఫ్యామీలీకి కోడలిగా పరిచయం చేస్తున్నారంట.. నాకు పిలుపొచ్చింది. నేను వెళ్తున్నా" అని కనకం అనగా.. "నిన్ను గెంటేస్తారు. వద్దు" అని కనకం భర్త అంటాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దని కనకం కుటుంబమంతా చెప్తారు. అయినా వినకుండా కనకం మరియు వాళ్ళ అక్క గెటప్స్ మార్చుకొని ఆ దుగ్గిరాల ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్తారు. స్వప్న కూడా వాళ్ళ గురించే ఆలోచిస్తూ.. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎలాగైనా అక్కడికి వెళ్ళాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
